2024, సెప్టెంబర్ 30 వరకు జర్నీ..
వింటర్ సేల్లో భాగంగా.. ఈ ఆఫర్ డిసెంబర్ 10 వరకే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది విస్తారా. అంటే ఇవాళే ఒక్కరోజే టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆఫర్లో భాగంగా విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని భావించే వారు డిసెంబర్ 11 నుంచి 2024 సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు.
మరోవైపు.. ఆఫర్ కేవలం డైరెక్ట్ ఫ్లైట్స్కు మాత్రమే వర్తిస్తుంది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ టికెట్లను ఆఫర్లో భాగంగా బుక్ చేసుకోవచ్చు. రూ. 1923 ధర అనేది ఎకానమీ క్లాస్కు వర్తిస్తుంది. ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ రేటు రూ. 2323 నుంచి ప్రారంభమవుతోంది. బిజినెస్ క్లాస్ టికెట్ రేటు రూ. 9923 నుంచి మొదలవుతోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కేవలం బేస్ ఫేర్కు మాత్రమే వర్తిస్తుంది. అంటే అదనపు చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు టికెట్ రేటు పైకి చేరుతుంది. ఈ ఆఫర్ ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుందని ప్రయాణికులు గుర్తించుకోవాలి. కంపెనీ ఆఫర్ ముగిసిన తర్వాత రెగ్యులర్ టికెట్ రేట్లు వర్తిస్తాయి. ఈ ఆఫర్ కంపెనీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
Also Read: గుడ్న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి రూ.2000 డౌన్.. ఇవాళ్టి రేట్లు ఇవే!
- Read Latest Business News and Telugu News