ఈ ఆఫర్ కింద నవంబర్ 7 వ తేదీ నుంచి నవంబర్ 9, 2023 మధ్య టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారు నవంబర్ 7, 2023 వ తేదీ నుంచి నవంబర్ 10, 2024 మధ్య ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. ఆఫర్ సేల్ కింద్ ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ టికెట్లపై డిస్కౌంట్లను విస్తారా అందిస్తోంది. వన్- వే దేశీయ ఛార్జీలు ఎకానమీకి రూ. 1,999, ప్రీమియం ఎకానమీకి రూ. 2,899, బిజినెస్ క్లాస్కు రూ. 10, 999 నుంచి మొదలవుతున్నాయి.
ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు విస్తారా అధికారిక వెబ్సైట్, ట్రావెల్ యాప్స్, విస్తారా ఎయిర్పోర్ట్ టికెట్ ఆఫీసులు, ఎయిర్లైన్స్ కాల్ సెంటర్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్లో డైరెక్ట్ ఛానెల్ డిస్కౌంట్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు, సాఫ్ట్ ప్రయోజనాలు వర్తించవని కంపెనీ తెలిపింది. మరోవైపు.. ఈ ఆఫర్ కింద లిమిటెడ్ సీట్లను మాత్రమే సేల్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ప్రత్యేక సేల్తో వేడుకలను ప్రారంభించం సంతోషంగా ఉందని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రజావత్ వెల్లడించారు. దీని ద్వారా వినియోగదారులకు తగ్గింపు ధరలతో భారత దేశంలోని అత్యుత్తమ విమానయాన సంస్థల్లో ప్రయాణించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రయాణికులు విస్తారా ఎయిర్ లైన్స్ను తమ ప్రాధాన్య సంస్థగా ఎంచుకోవడం కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Retirement Plan: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.1 లక్ష పెన్షన్ రావాలంటే ఏం చేయాలి?
- Read Latest Business News and Telugu News